
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చూడముచ్చటగా ఉండే జంటలలో ఒక్కరు సమంత మరియు నాగ చైతన్యల జంట, ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా పరిచయం అయినా వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమించుకొని పెద్దల సమసక్యం లో పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, 2017 వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లి అతిరధ మహ్యరాదుల సమక్షయం లో ఘనంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, ఎలాంటి మనస్పర్థలు లేకుండా సజావుగా సాగుతున్న వీళ్లిద్దరి దాంపత్య జీవితం అనుకోని మలుపులు తిరిగి ఇటీవలే విడాకులు తీసుకున్న సంఘటన అక్కినేని మరియు సమంత అభిమానులను తీవ్రమైన విషాదం లోకి నెట్టేసింది,జులై 21 వ తారీకు నుండి సమంత మరియు నాగ చైతన్య ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు అనే వార్తలు వినిపించాయి, సమంత కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిట్లో తన పేరు నుండి అక్కినేని అనే పదం ని తొలగించింది, దీనితో వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యాయి, అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమే అని నిన్న మొన్నటి వరుకు అభిమానుల్లో ఒక్క చిన్న ఆశ ఉండేది, కానీ సమంత మరియు నాగ చతన్య ఇద్దరు కూడా తాము విడిపోయాము అని సోషల్ మీడియా సాక్షిగా అధికారిక ప్రకటన చెయ్యడం తో అభిమానుల్లో నిరాశ జ్వాలలు చెలరేగిపొయ్యాయి.
ఇక వీళ్లిద్దరి వైదికుల పై సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, సమంత తన కెరీర్ కోసం పూర్తిగా తన బేస్ ని మొత్తం బాలీవుడ్ కి మార్చే ప్రయత్నం లో ఉంది అని, ఇది నాగ చైతన్య కి ఏమాత్రం ఇష్టం లేదు అని, కలిసి ఉండడం సాధ్యం కాదు కనుక విడిపోవడమే ఇద్దరి కెరీర్స్ కి మంచిది అనే ఏకాభిప్రాయం తో విడాకులు తీసుకున్నారు అనే వార్త జోరుగా ప్రహకారం సాగుతుంది, ఇంకో విషయం ఏమిటి సమంత వ్యక్తిగత స్టైలిస్ట్ ఇంస్టాగ్రామ్ లో నాగ చైతన్య పై చురకలు అంటించిన ఘటన సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది, ఒక్క రేలషన్ షిప్ లో దాపరికాలకు మరియు అబద్ధాలకు ఏ మాత్రం చోటు లేదు అని, నువ్వు ఎంత సీక్రెట్ గా మైంటైన్ చేసిన ఎదో ఒక్క రోజు దొరికిపోతావు అని నాగ చైతన్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ఆరోపణలను బట్టి చూస్తే నాగ చైతన్య వేరే అమ్మాయి తో రిలేషన్ మైంటైన్ చెయ్యడం వల్లే సమంత అతని నుండి విడాకులు కోరుకుంది అనే వార్త కూడా జోరుగా ప్రచారం అవుతుంది,మరి వీటిల్లో ఏది నిజం అనేది ఇప్పటి వరుకు ఎవ్వరికి తెలియదు, అటు సమంత కానీ ఇటు నాగ చైతన్య కానీ వీటి పై మాట్లాడడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.
ఇక విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య తన కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది, ఇటీవలే నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే విడుదల అయినా అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, విడుదలకి ముందే బ్లాక్ బస్టర్ సాంగ్స్ వాళ్ళ ఎంతో హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా సరికొత్త రికార్డు నెలకొల్పింది,ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఒక్క హర్రర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు, ఇక తమ ఫామిలీ కి మనం వాకాటి సెన్సషనల్ హిట్ ని ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కలిసి థాంక్యూ అనే సినిమా లో నటిస్తున్నాడు, ఇక సమంత విడాకులు తర్వాత తన బేస్ ని మొత్తం ముంబై కి షిఫ్ట్ చెయ్యబోతున్నట్టు సమాచారం, ప్రస్తుతం ఆమె గుండా శేఖర్ తో శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది, ఈ సినిమా తో పాటు తమిళ్ లో విజయ్ సేతు పతి తో కలిసి ఒక్క సినిమాలో నటిస్తుంది, కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నటన కి ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చెయ్యడానికి సమంత ఇప్పుడు ఆసక్తి చూపుతుంది, మరి విడాకులు తర్వాత వీళ్లిద్దరి సినీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.