
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఏ బ్యానర్ వాళ్లు త్రివిక్రమ్ కి ఎంతో సపోర్ట్ గా నిలిచారు అని చెపుకోవచ్చు. ఐతే ఇదే సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమాలో తన రాబోతున్న సినిమా కధలో అడ్డుపడుతునారు అని ఇండస్ట్రీ లో ఒక టాక్ నడుస్తుంది . ఇంతే కాకుండా మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా గురించి కూడా భిన్నమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇండస్ట్రీ లో . అదేంటంటే మహేష్ బాబు కధ విషయం లో సంతృప్తి గా లేరు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఐతే మహేష్ బాబు అభిమానులు కొంతమంది ఈ వార్తలు నిజం అని నముతున్నారు. సోషల్ మీడియా లో ఈ న్యూస్ వైరల్ అవడం తో నిర్మాత నాగవంశీ ఈ వార్తల్లో నిజం లేదు అని, రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది అని తెలిపారు . రెగ్యులర్ షూటింగ్ జరిగితే ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చే అవకాశాలు లేవు అని అభిమానులు చెప్తున్నారు. మరి కొంతమంది అభిమానులు ఐతే సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని వాఖ్యానిస్తున్నారు..మహేశ్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. పూజా హెగ్డేకి ఈ సినిమా విజయం ముఖ్యం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే కెరీర్ వైపు అడుగులు వేస్తోంది. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో ఈ సినిమా రూపొందనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడడం లేదని తెలుస్తోంది.
మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఆ ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కొన్ని వారాల క్రితమే పూర్తయిన సంగతి తెలిసిందే. ఇటీవలే మహేష్ బాబు తన ఫామిలీ తో కలిసి ట్రిప్ కి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈ నెల రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ అవనుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తన తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్లో మరణించినప్పుడు నటుడు ఇటీవల వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన రాబోయే చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. # SSMB28 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు మరియు ఈ నటుడు తదుపరి దర్శకుడు SS.రాజమౌళితో పాన్-ఇండియా చిత్రం కోసం అసోసియేట్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. దీని కోసం రాజమౌళి కధ రెడీ చేస్తున్నాడు .