
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ విడాకులు తీసుకొని దాదాపుగా 10 ఏళ్ళు గడుస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..అప్పట్లో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న సంఘటన మీడియా లో పెను దుమారమే రేపింది..రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ రష్యా కి చెందిన అన్నా లెజినవ అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు..ఇక రేణు దేశాయ్ కూడా తన కోసం తన పిల్లల కోసం రెండవ పెళ్లి చేసుకోక తప్పడం లేదు అని..ఒక్క సందర్భం లో తెలిపిన సంఘటన అప్పట్లో పెద్ద చర్చలకు దారి తీసింది..అతని ఫోటో చూపెట్టకుండా సగానికి చూపెడుతూ నిశ్చితార్థం కూడా జరిగినట్టు అప్పట్లో రేణు దేశాయ్ పెట్టిన పోస్టులు పెద్ద దుమారమే రేపాయి..రేణు దేశాయ్ రెండవ పెళ్లి గురించి అప్పట్లో సోషల్ మీడియా లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి..కొంతమంది ఆమె కి బెస్ట్ విషెస్ తెలియచేయగా, మరికొంత మంది తీవ్రమైన విమర్శలు చేసారు..రేణు దేశాయ్ అవేమి పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ పోయింది.
అయితే రెండవ పెళ్లి చేసుకుంటున్నాను అని రేణు దేశాయ్ చెప్పి దాదాపుగా ఏడాది గడిచిపోయింది..నిశ్చితార్థం జరిగిన తర్వాత వీళ్లిద్దరికీ పెళ్లి జరిగిందా లేదా అనేది ఇప్పటికి ఎవ్వరికి తెలీదు..అయితే రేణు దేశాయ్ ఇప్పుడు జీ తెలుగు లో ఒక్క రియాలిటీ షో లో జడ్జి గా వ్యవహరిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రియాలిటీ షో లో ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటూ ఉంటుంది..ఒక్క సారి ఆమె కూతురు ఆద్య కూడా ఈ షో లో పాల్గొన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇది ఇలా ఉండగా ఇటీవల జరిగిన ఒక్క ఎపిసోడ్ లో రేణు దేశాయ్ కి తన కాబొయ్యే భర్త నుండి వచ్చిన వాయిస్ నోట్ ని అందరికి వినిపించింది..ఈ వాయిస్ నోట్ లో ఆయన మాట్లాడుతూ ‘ నా జీవితం లో చోటు చేసుకున్న అద్భుతం రేణు దేశాయ్..ఈమె వచ్చినప్పటి నుండి నా జీవితం లో ఉన్న కష్టాలు అన్ని తొలగిపోయాయి..ఆమె నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం తో సమానంగా భావిస్తున్నాను’ అంటూ ఆ వాయిస్ నోట్ లో చెప్పుకొచ్చాడు.
రేణు దేశాయ్ తన కాబొయ్యే భర్త గురించి మాట్లాడుతూ ‘నేను జీవితం లో చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇతను నాకు పరిచయం అయ్యాడు..నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నాడు..అకిరా మరియు ఆద్యలకు కూడా ఆయన అంటే ఎంతో ఇష్టం..ఆయన ఇంతకు ముందు అమెరికా లో జాబ్ చేస్తూ ఉండేవాడు..ఇండియా కి వచ్చిన తర్వాత పూణే లో ఒక్క ప్రముఖ MNC ఐటీ కంపెనీ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు..చాలా మంచి వ్యక్తి..త్వరలోనే ఈ స్టేజి మీద మీ అందరికి పరిచయం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్..ఇది ఇలా ఉండగా జానీ సినిమా తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు పూర్తి గా దూరం అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సినిమాలకు కాస్ట్యూమ్ డిసైనర్ గా పని చేసింది కానీ..వెండితెర మీద మాత్రం ఆమె మళ్ళీ కనిపించలేదు..ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది..రవితేజ హీరో గా వంశి అనే నూతన దర్శకుడితో టైగెర్ నాగేశ్వర రావు అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా లో రేణు దేశాయ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది..ఇటీవలే ఈ చిత్రం ఓపెనింగ్ జరగగా, ఈ వేడుకకి రేణు దేశాయ్ కూడా హాజరు అయినా సంగతి మన అందరికి తెలిసిందే.