
తమిళ్ సీనియర్ నటుడు సత్య రాజ్ హాస్పిటల్ లో చేరారు ఆయనకి కోవిడ్ రావడంతో ఐసొలేషన్ లో ఉన్నారు అయితే ఆకస్మికంగా అయినా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారడం తో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఈ పేరు చెబితే ప్రేక్షకులకు గుర్తు పడతారో లేదో తెలీదు కానీ కట్టప్ప అనగానే తెలుగు వారే కాదు దేశ వ్యాప్తంగా సినిమా ప్రేముకులు అందరు వెంటనే గురుతుపట్టేస్తారు అలాంటి ఎన్నో పాత్రలకు నటనతో ప్రాణం పోసాడు సత్యరాజ్, తాజాగా ఈ నటుడు హాస్పిటల్ లో చేరడం తో సినీ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు మరో పక్క దేశ వ్యాప్తంగా చాలామంది సినీ సెలెబ్రిటీలు వరసగా కోవిడ్ బారాణా పడుతున్నారు బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. తెలుగు ఇండస్ట్రీ లో కూడా మహేష్ బాబు మంచు లక్ష్మి, తమన్ తదితరులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
త్రిష కి కోవిడ్ సోకింది తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తనకి కోవిడ్ సోకిందని తెలిపారు త్రిష దీనికి సంబందించిన ఆమె తాజాగా ట్వీట్ చేసింది, వైరస్ నుంచి వేగంగా కోలుకుంటున్నాను అని అంటే కాదు ఇప్పటికే కోవిడ్ వాక్సిన్ తీసుకున్నాను అని దీనివల్ల త్వరగా కోలుకుంటున్నాను అని వాక్సిన్ వల్ల మేలు జరిగిందని పేరుకున్నారు. త్రిష ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ విష్యం ని తమన్ తన సోషల్ మీడియా లో తెలియ చేసారు. తనని కలిసిన వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేపించుకోమని తెలియ చేసారు, ఇటీవల హీరో మహేష్ బాబు తనకి కోవిడ్ సోకింది అనే విషయాన్ని తెలియ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తమన్ కోవిడ్ టెస్ట్ చేపించుకుంటే పాజిటివ్ అని తేలింది, ఇపుడు సత్యరాజ్ కి కూడా కోవిడ్ సోకడం హాస్పిటల్ లో చేరడం జరిగింది.
సత్యరాజ్కి నటుడు కావాలనేది కల అయితే అతని తల్లి దానిని వ్యతిరేకించింది మరియు అతను సినిమాల్లోకి రాకూడదని నిషేధించింది. 1976లో తన తల్లి వ్యతిరేకత ఉన్నప్పటికీ అతను కోయంబత్తూరును విడిచిపెట్టి కోడంబాక్కంలో ఉన్న తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. సత్యరాజ్ అన్నకిలి సినిమా షూటింగ్ చూసిన తర్వాత ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు. అక్కడ అతను నటుడు శివకుమార్ మరియు నిర్మాత తిరుప్పూర్ మణియన్లను కలుసుకున్నాడు మరియు తన సినిమా ఆశయాలను నెరవేర్చడంలో సహాయపడటానికి వారిని వేధించడం ప్రారంభించాడు. శివకుమార్ తన నటనపై ఆసక్తిని తీవ్రంగా విమర్శించాడు మరియు వెంటనే ఇంటికి తిరిగి రావాలని సూచించాడు. అయినా చెన్నైలోనే ఉండిపోయాడు. నిర్మాత మఠంపాటి శివకుమార్ ప్రతినెలా డబ్బు పంపుతూ అతనికి మద్దతుగా నిలిచారు.
కోమల్ స్వామినాథం నాటక బృందంలో చేరాడు. 1978లో సత్యరాజ్ నటుడిగా గుర్తింపు పొందిన మొదటి చిత్రం సత్తమ్ ఎన్ కైయిల్, ఈ చిత్రంలో అతను తెంగై శ్రీనివాసన్ పోషించిన ప్రధాన విలన్కి అనుచరుడిగా నటించాడు. తర్వాత కన్నన్ ఒరు కైక్కుజాంతై చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు. అతను తన కెరీర్ను విలన్గా సపోర్టింగ్ రోల్స్ మరియు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ప్రారంభించాడు. ఆ తర్వాత కడలోర కవితైగళ్ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ఇ.వి.గా కూడా నటించారు. తమిళనాడు ప్రభుత్వం పెరియార్ చిత్రాన్ని స్పాన్సర్ చేసిన రామసామి. అతను 3 విభిన్న పాత్రల్లో నటించిన విల్లాది విలన్ చిత్రానికి కూడా దర్శకుడు. ప్రస్తుతం సత్యరాజ్ తెలుగు లో పక్క కమర్షియల్, తమిళ్ లో పార్టీ, ఖాకి అనే సినిమాలో నటిస్తున్నాడు ఇక సత్యరాజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.