
చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవడం అంటే మాములు విషయం కాదు..మన ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్ళ తరబడి సినిమాల్లో నటిస్తున్నా కూడా ఇప్పటికి స్టార్ స్టేటస్ ని అందుకొని హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు..అలాంటి హీరోయిన్స్ ఉన్న ఈ కాలం లో కూడా కేవలం ఒకటి రెండు సినిమాలతో వచ్చిన క్రేజ్ తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు..ఆ అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరే కైరా అద్వానీ..ఈమె మన తెలుగు లో ఇప్పటి వరుకు కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది..ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు గా నటించిన భరత్ అనే నేను సినిమా అయితే,మరొకటి రామ్ చరణ్ హీరో గా నటించిన వినయ విధేయ రామా చిత్రం..ఈ రెండు సినిమాల భరత్ నేను ఒక్కటే హిట్ అయ్యింది..కానీ ఈ అమ్మడికి ఆ సినిమా ద్వారా మన టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ అంత ఇంతా కాదు..ఈ సినిమాకి ముందే ఆమె బాలీవుడ్ లో పలు హిట్ సినిమాలల్లో హీరోయిన్ గా నటించింది.
బాలీవుడ్ లో ఈమెకి క్రేజ్ ఉండడం సహజం..కానీ టాలీవుడ్ లో కేవలం ఒకే ఒక్క హిట్ తో ఈమె సాధించిన క్రేజ్ చూస్తే మిగిలిన హీరోయిన్స్ కి అసూయ రాక తప్పదు..ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లోహిట్టు మీద హిట్టు కొడుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా ఆమె స్థానం ఏ రేంజ్ లో ఉంది అంటే సూపర్ స్టార్ హీరోలు కూడా ఈమె కాల్ షీట్స్ కోసం ఎదురు చూసేలా చేసే రేంజ్ కి ఎదిగిపోయింది..టాలీవుడ్ లో ఇటీవల కాలం లో స్టార్ హీరోల సరసన నటించేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా డేట్స్ సర్దుబాటు చెయ్యలేక వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..ప్రస్తుతం ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఇది పక్కన ఈమెకి బాలీవుడ్ లో స్టార్ హీరోలతో చనువు కూడా చాలా ఎక్కువే.
ఒక స్టేజి వరుకు ఆ చనువు ని సరదాని చూడడానికి మనకి కూడా బాగానే ఉంటుంది..కానీ అది హద్దులు దాటినప్పుడే మనకి చిరాకు కలుగుతుంది..ఇటీవల ఈ అమ్మడు చేస్తున్న పనులు చూస్తుంటే అలానే ఉన్నాయి మరి..ఇటీవలే ఈమె వరుణ్ ధావన్ తో కలిసి నటించిన ‘జగ్ జగ్ జియో’ సినిమా విడుదలై సెన్సషనల్ హిట్ అయ్యింది..కేవలం వారం రోజుల్లోపే ఈ సినిమా బాలీవూడ్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది..ఈ సినిమా హిట్ అయ్యినప్పటి నుండి ఈ జంట సక్సెస్ పార్టీస్ లో జోరుగా పాల్గొంటున్నారు..ఇప్పటి వరుకు ఒక పది సక్సెస్ మీట్స్ లో ఈ జంట కలిసి పాల్గొన్నట్టు సమాచారం..అయితే ఇటీవల జరిగిన ఒక సక్సెస్ మీట్ లో కైరా అద్వానీ మరియు వరుణ్ ధావన్ కలిసి మీడియా కోరిక మేరకు ఫోటో షూట్ ఇచ్చారు..ఈ ఫోటో షూట్ ఈ జంట శృతి మించింది..వరుణ్ ధావన్ తనకి ఉన్న చనువుని ఆసరాగా తీసుకొని అవసరం లేకపోయినా కైరా అద్వానీ బుగ్గ పై ముద్దు పెట్టాడు..ఒక్కసారిగా అక్కడ ఉన్న మీడియా కూడా ఈ సంఘటన చూసి షాక్ కి గురైంది..ఇంత ఓవర్ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉంది..వరుణ్ నీకు పెళ్ళైన విషయం పూర్తిగా మర్చిపోయావా అంటూ నెటిజెన్స్ వరుణ్ ధావన్ పై విరుచుకుపడుతున్నారు..మరి సోషల్ మీడియా లో వస్తున్నా ఈ నెగటివిటీ ని గమనించైనా సరే ఈ జంట ఇక నుండి హద్దులో ఉంటుందో లేదో చూడాలి.