
టాలీవుడ్ లో గత కొంతకాలం నుండి ఒక్క రేంజ్ లో చర్చలు జరుగుతన్న అంశం సమంత మరియు నాగ చైతన్య విడాకుల వ్యవహారం, ఏ మాయ చేసావే సినిమా తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టినా ఈ జంట అంటే టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి ఇష్టమే,ఆన్ స్క్రీన్ మీద ఈ జంట అప్పట్లో సృష్టించిన ప్రభంజనమ్ అలాంటిది, ఇక విధి రాసిన రాత వల్ల నిజ జీవితం లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు ఎంతో సంతోషం గా గడుపుతున్నారు అని అందరూ అనుకున్నారు, కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈ జంట పెళ్లి అయినా నాలుగేళ్లకే కొన్నియో అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, ఈ విషయం ని స్వయంగా సమంత మరియయు నాగ చైతన్య మీడియా సాక్షిగా తెలిపారు, ఇక అప్పటి నుండి నేటి వరుకు వీళ్లిద్దరి గురించి రోజు సోషల్ మీడియా లో ఎదో ఒక్క చర్చ జరుగుతూనే ఉంది, ఇక సమంత పైజరిగిన కొన్ని అసత్య ప్రచారాలకు అయితే కొదవే లేదు, దీని పైన ఆమె కోర్టు లో కేసు కూడా వేసింది, ఇది ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియా లో వీళ్లిద్దరికీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది,అదేమిటో ఇప్పుడు మనం చూద్దాము.
ఇక అసలు విషయానికి వస్తే చైతు తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎక్కడ ఉంటుంది అనే దానిపై సోషల్ మీడియా లో అనేక ప్రశ్నలు ఎదురు అయ్యాయి, అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం , సమంత మరియు నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ లో ఒక్క అందమైన వీళ్ళని ఎంతో ఇష్టం తో కొనుగోలు చేసారు అట,ఇక్కడే ఈ ఇద్దరి దంపతులు చాలా కాలం నివసించారు కూడా, ఇప్పుడు సమంత అక్కడే ఉంటునటు సమాచారం,ఇటీవలే నాగ చైతన్య కూడా ఒక్కసారి సమంత ని కలిసాడు అట, ప్రస్తుతం ఈ విషయం లో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది, వీళ్లిద్దరు భార్య భర్తలు విడిపోయిన కూడా ఒక్క సేన్హితులుగా మాత్రం జీవితాంతం కొనసాగుతాము అని బహిరంగంగానే తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే, అలా స్నేహ పూర్వకం గానే సమంత ని నాగ చైతన్య ఇటీవలే ఆ వీళ్ళలో కలిసినట్టు సమాచారం, ఈ విషయం బయటకి రాగానే మల్లి వీళ్లిద్దరు ఒక్కటైపోతే బాగుండును అని ప్రతి ఒక్కరికి అనిపించింది, కానీ అది అసాధ్యం అనే వాస్తవం అందరూ గమనించాలి.
ఇక విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య మరియు సమంత తమ కెరీర్స్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు,ఇటీవలే ఆయన లవ్ స్టోరీ మరియు బంగార్రాజు వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాల తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు,ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకి చేరుకుంది.. ఇందులో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా తో పాటు ఆయన బాలీవుడ్ లో అమిర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించాడు,ఇలా నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీ గా ఉండగా సమంత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది..లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరో పక్క విలన్ రోల్స్ కూడా చేస్తుంది, ఇటీవలే ఈమె విలన్ గా నటించిన ఫామిలీ మ్యాన్ సీసన్ 2 లో ఆమె నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఈ సినిమాకి ముందు ఆమె సూపర్ డీలక్స్ మరియు 10 ఎండ్రకుల్లా వంటి సినిమాల్లో విలన్ గా నటించింది, ఇలా విబిబిన్నమైన పాత్రలతో సమంత తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుంది.